Hema: లావణ్యని పూరీ జగన్నాథ్ లేపుకొచ్చాడు.. నేను, మా ఆయన వాళ్లకి పెళ్లి చేశాం… హేమ షాకింగ్ కామెంట్స్!

Hema: రెండు లక్షల అప్పు కోసం దాదాపు 15,20 రోజుల పాటు చాలా తిరిగామని నటి హేమ అన్నారు. తన అంకుల్ తెలిసిన వాళ్లు ఎవరో చెబితే, వాళ్ల దగ్గరికి వెళ్లి ఓ ప్రైవేట్ లోన్ కోసం అతన వచ్చే వరకు ఎదురుచూశామని ఆమె చెప్పారు. ఆ తర్వాత అన్ని డిటేల్స్, పేపర్స్ అక్కడ సబ్‌మిట్ చేసే సరికి 15 రోజులు పట్టిందని ఆమె అన్నారు. అయినా సరే పట్టుబట్టి మొండిగా ఆ 2 లక్షలు అప్పుగా తీసుకొని సనత్ నగర్‌లో ఇళ్లు కొన్నానని హేమ వివరించారు.

ఇకపోతే తన ఇళ్లు కొన్న ఇంటి కింద భాగంలో పూరీ జగన్నాథ్ రెంట్‌కి వచ్చారని, ఆ కాలనీలోనే కృష్ణ వంశీ కూడా ఉండేవారని ఆమె చెప్పారు. తాను అప్పటికి యాక్టింగ్ చేయడం లేదు గానీ ఇండస్ట్రీలోనే ఉన్నానని ఆమె అన్నారు. అలా ఇళ్లు కొని, ఆ తర్వాత దాచిన డ‌బ్బులతో తన భర్తకు ఒక చెయిన్ కూడా కొన్నానని, అలాగే జగన్‌ అన్నయ్యకు ఏమైనా అవసరం ఉందంటే ఇచ్చేదాన్నని ఆమె తెలిపారు. ఎవరు ఎప్పుడొచ్చినా కడుపు నిండా భోజనం పెట్టేదాన్నని, సమీర్ కూడా తన ఇళ్లింట్లో కొన్ని రోజులు భోజనం చేసేవాడని, అతను ఓ తమ్ముడిలా ఉండేవాడని హేమ చెప్పారు. అలా జాన్ సంపాదనతో కాలం వెల్లదీస్తూ, మళ్లీ తన స్టేజ్ ఎక్కడా తగ్గకుండా కాపాడుకుంటూ వచ్చానని ఆమె స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా పూరీ గారిని కలవడానికి అసిస్టెంట్ డైరెక్టర్లు, డైరెక్టర్లు వస్తూ ఉండేవారని హేమ చెప్పారు. అతనికి కాళ్లు కడిగి కన్యాదానం కూడా తామే పెళ్లి చేశామని ఆమె తెలిపారు. సడెన్‌గా ఆ అమ్మాయిని తీసుకొచ్చాడని, ఆ అమ్మాయికి తండ్రి లేరని, కాబట్టి మిస్సింగ్ ఫీలింగ్ ఎప్పుడొచ్చినా జాన్‌తో మాట్లాడి, వెళుతూ ఉంటుందని ఆమె అన్నారు. జాన్‌ను డాడీ అని కూడా పిలుస్తుందని ఆమె చెప్పారు. పూరీ లవ్‌స్టోరీ తనకు ముందే తెలుసునని, ఆ అమ్మాయిని ఫస్ట్ తీసుకొచ్చి పరిచయం చేసింది కూడా తనకే అని హేమ స్పష్టం చేశారు. అతనికి పెద్ద దిక్కు తానే అని, తనతో అన్నీ షేర్ చేస్కుంటాడని ఆమె వివరించారు.