Bhagyashree: బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి భాగ్యశ్రీ..?

Bhagyashree: ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ ని చిన్నచూపు చూసిన బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు టాలీవుడ్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా బాలీవుడ్ అగ్ర హీరోయిన్ లు తెలుగు హీరోలతో నటించడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అయినా సల్మాన్ ఖాన్ కూడా త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలు వారికి టాలీవుడ్ లో నటించాలని ఉంది అంటూ వారి మనసులోని మాటలను బయట పెట్టిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే నటి భాగ్యశ్రీ తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. నటి భాగ్యశ్రీ తాజాగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాలో ప్రభాస్ కు తల్లి పాత్రలో నటిస్తోంది. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది భాగ్యశ్రీ. ఇక ఈ సినిమా మార్చి 11న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా భాగ్యశ్రీ మాట్లాడుతూ.. ప్రస్తుతం బాలీవుడ్ లో అన్ని పాత కథలు, కాఫీ స్క్రిప్ట్ వస్తున్నాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక తెలుగు తమిళ ఇండస్ట్రీలో కొత్త కొత్త కథలు, కొత్త స్క్రిప్ట్ లు వస్తున్నాయి అని తెలిపింది.