Soonu Sood: నటుడు సోనూ సూద్ ఫై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?

Soonu Sood: బాలీవుడ్ నటుడు, కలియుగ కర్ణుడు అయినా సోనుసూద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో వేలాది మంది ప్రజలకు అండగా నిలిచి కలియుగ కర్ణుడు గా పేరు సంపాదించుకున్నాడు. నటుడిగా కూడా ప్రేక్షకుల మనసులో మంచి స్థానం సంపాదించుకున్నాడు సోనుసూద్.ఇది ఇలా ఉంటే తాజాగా సోను సూద్ ఫై పంజాబ్ లో కేసు నమోదు అయింది. తాజాగా ఆదివారం రోజు పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సోను సూద్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు ఆరోపణలు రావడంతో అతనిపై కేసు నమోదు అయ్యింది.

సోనూ సూద్ సోదరి మాళవిక కాంగ్రెస్ లో చేరి మోగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగింది. పోలింగ్ రోజున తన సోదరి కోసం సోనూసూద్ ప్రచారం చేస్తూ నిబంధనలు ఉల్లంఘించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళికి సంబంధించినటువంటి జిల్లా అదనపు మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను సోనుసూద్ ధిక్కరించడం తో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.