Acharya : “ఆచార్య” రికార్డు లెక్కలు అప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయట.!

Acharya : మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మాత్రమే కాకుండా సౌత్ ఇండియన్ సినిమా నుంచే ఇప్పుడు అనేక మల్టీ స్టారర్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మరి ఈ సినిమాల్లో హీరో లు కూడా ఒకరికొకరు ఎక్కడా తక్కువ కానీ వారే ఉన్నారు. ఇక ఈ సినిమాల్లో ఒక క్రేజీ మల్టీ స్టారర్ బొమ్మే “ఆచార్య”.

ఫుల్ లెంగ్త్ లో మెగాస్టార్ చిరంజీవి మరియు తన కొడుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు కలయికలో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా పైనే భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. మరి మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రంపై లేటెస్ట్ ఇన్ఫో ఒకటి తెలుస్తుంది.

ఇంకా ఈ సినిమా తాలూకా థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకోలేదట. మరి ఈ బిజినెస్ ని వచ్చే మార్చ్ మొదటి వారంలో స్టార్ట్ చేసి ఆ వారాంతం లోగా కంప్లీట్ చేయాలని చిత్ర బృందం డిసైడ్ అయ్యారట. అయితే ఈ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరగనుంది అని తెలుస్తుంది.

ఈ సినిమాకి బడ్జెట్ కూడా భారీ స్థాయిలో పెట్టగా ఆ మధ్య రికార్డు స్థాయిలో 100 కోట్ల మేర బిజినెస్ ఈ సినిమా చేస్తుంది అని తెలిసింది. ఇక ఇప్పుడు ఎంత మార్క్ దగ్గర ఆచార్య ఆగుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోల సరసన కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డేలు హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే. అలాగే మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు.