Acharya Distributor : ఈ ఏడాదిలో టాలీవుడ్ లో ఎన్నో అంచనాలు పెట్టుకొని వచ్చి వాటిని అందుకోవడంలో విఫలం అయ్యిన మరో భారీ సినిమా “ఆచార్య”. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఒక ఎపిక్ డిజాస్టర్ సినిమాల లిస్ట్ లో చాలా నష్టాలతో ఈ సినిమా నిలిచిపోయింది.
మొదటి రోజు నుంచే విపరీతమైన నెగిటివ్ టాక్ తెచ్చుకొని డిస్ట్రిబ్యూటర్స్ లో ఊహించని నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే వాటిని సెటిల్ చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అవి ఎంతవరకు సెటిల్ అయ్యాయో కానీ తాజాగా ఏకంగా ఓ డిస్ట్రిబ్యూటర్ నేరుగా మెగాస్టార్ చిరంజీవికే లెటర్ పంపడం షాకింగ్ గా మారింది.
ఇంతకీ ఆ లెటర్ లో ఏముందంటే కర్ణాటకకి చెందిన డిస్ట్రిబ్యూటర్ అయిన రాజ్ గోపాల్ అనే వ్యక్తి వరంగల్ శ్రీను నుంచి భారీ మొత్తం ఒక ఏడాది కితమే చెల్లించి కొనుగోలు చేశామని అందరిలానే నేను కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నాను కానీ అనూహ్యంగా సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉందో మీకు కూడా తెలుసు.
నేను పెట్టిన దానిలో కేవలం ఈ చిత్రానికి 25 శాతం మాత్రమే రాబడి వచ్చింది. ఇంకా నాకు 75 శాతం నష్టంలో ఉందని. చాలా చోట్ల డబ్బు తెచ్చి ఈ సినిమా కోసం పెట్టానని ఇది వరకే కరోనా లో మేము ఎంత నష్టపోయామో మీకు తెలియంది కాదు అందుకే నా విన్నపాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు అంగీకరించి తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని ఈ లెటర్ లో తాను తెలిపారు. దీనితో ఈ షాకింగ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

