Sudigali Sudheer: సుధీర్ ని ఒక ఆట ఆడుకున్న ఆది.. అయ్యగారే నంబర్ వన్ అంటూ..!

Sudigali Sudheer: తన కామెడీతో బుల్లితెర మీద సందడి చేస్తున్న సుధీర్ ఫాలోయింగ్ , క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ లో తన కెరీర్ ప్రారంభించిన సుధీర్ ప్రస్తుతం ఎన్నో టీవీ షోస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఒకవైపు బుల్లితెర మీద హంగామా చేస్తూనే మరొకవైపు బిగ్ స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటుకున్నాడు. సుధీర్ సినిమాలలో నటిస్తూ నటుడిగా కూడా మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం సుధీర్ హీరోగా కొన్ని సినిమాలలో నటిస్తున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఈ టీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షో ప్రసారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ కామెడీ షో లో కమెడియన్లతో పాటు ఎంతో మంది టీవీ ఆర్టిస్టులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ షోకి సుధీర్ యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు.

ఇటీవల ఈ వారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో అక్కడ ఉన్న వారందరూ సుధీర్ ని ఒక ఆట ఆడుకున్నారు. గతంలో ఒక తాగుబోతు నెటిజన్ అఖిలే నెంబర్ వన్ అంటూ పాపులర్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. నిజంగా సోషల్ మీడియాలో అఖిల్ కంటే ఈ తాగుబోతు వ్యక్తికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఈవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో ఆ వ్యక్తి సందడి చేయనున్నాడు. వచ్చి రావడంతోనే అయ్యగారే నంబర్ వన్ అని స్లోగన్ స్టార్ట్ చేశాడు.

ఈ ఎపిసోడ్ లో సుధీర్ కి సన్మానం చేసే క్రమంలో అందరూ సుధీర్ తో ఒక ఆట ఆడుకున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన పంచులతో నానా హంగామా చేశాడు. సుధీర్ కి సన్మానం చేసి ఊరేగించే సమయంలో ఆ తాగుబోతు వ్యక్తి అందరికీ ట్విస్ట్ ఇస్తూ.. ఆఖిలే నంబర్ వన్ అని అంటాడు. దీంతో రామ్ ప్రసాద్ చూసావా రా ఇక్కడ నీకూ సన్మానం చేస్తే అఖిల్ నంబర్ వన్ అని అంటున్నాడు. మొత్తానికి ఈవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతోంది.