భోజనానికి తెలిసి స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన యువకుడు?

సాధారణంగా స్నేహితులంటే తమ స్నేహితుడు కష్ట సమయంలో ఉంటే నేనున్నానంటూ ముందుకొచ్చి ఆదుకునే వారే నిజమైన స్నేహితులు అని భావిస్తారు అయితే ప్రస్తుత కాలంలో ఇలాంటి బంధాల మధ్య ప్రేమలు ఆప్యాయతలు లేవని తెలుస్తోంది.స్వార్థం కోసం చివరికి కడుపున పుట్టిన కన్న బిడ్డలను కూడా కిరాతకంగా చంపుతున్న రోజులలో స్నేహ బంధానికి విలువ లేదని చెప్పాలి.ఈ క్రమంలోనే తమ స్నేహితుడిని భోజనానికి అని ఆహ్వానించి దారుణంగా హత్య చేసి చంపిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్, నారాయణ్‌పూర్‌కు చెందిన సర్వేష్‌ ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే గత బుధవారం తన స్నేహితులు సురేంద్ర, దినేష్ తన మిత్రుడిని భోజనానికి ఆహ్వానించారు.ఇలా తన కుమారుడిని భోజనానికి ఆహ్వానించిన రోజు నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విధంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తన స్నేహితుల సురేంద్ర దినేష్ పై అనుమానం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే వీరిద్దరిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే వీర్‌పూర్‌కు 3 కిలోమీటర్ల దూరంలోనున్న రాయ్‌పూర్‌లోని మామిడి తోటలో 30 అడుగుల లోతైన ఎండిన బావిలో సర్వేష్ మృతదేహాన్నిగుర్తించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోస్ట్మార్టం రిపోర్ట్స్ రాగానే అసలు మృతికి గల కారణాలు ఏంటో తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు అయితే ప్రేమ వ్యవహారం కారణంగానే సురేంద్ర దినేష్ ఇద్దరు కలిసి సర్వేశ్ ను హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.