తాము పడుతున్న ఇబ్బందుల గురించి నిలదీసిన వ్యక్తి.. కొడతావా కొట్టు అంటూ పెద్ద రెడ్డి వ్యాఖ్య!

తాజాగా గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అలా తాజాగా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడా ఎదురయింది. పర్యటనలో భాగంగా పెద్దారెడ్డి అనంతపురం జిల్లా యాడికి మండలం రామరాజు పల్లికి చేరుకోగా అక్కడ గౌస్ అనే ఓ ముస్లిం వ్యక్తి మురుగునీరు ఇళ్ల ముందే నిలబడుతుంది అని ప్రశ్నించారు.

వీటి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని.. ఇక్కడి నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని.. కాలువలే సరిగ్గా చేయలేనివారు ఎలా పాలిస్తారు అని అనడంతో.. వెంటనే పెద్దారెడ్డి ఏం కొడతావా కొట్టు అని అన్నారు. ఆ తర్వాత ఆ సమస్యను ఆ స్థానిక నాయకులను పిలిచి పరిష్కరించారు.