Crime News:గర్భవతి అయిన మైనర్ బాలిక.. పెళ్లి చేసుకోవాలని కోరగా…. చివరికి ఇలా!

Crime News: ప్రస్తుత కాలంలో దేశంలో రోజు రోజుకి అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయి. చిన్న పిల్లలు, ముసలి వారు అని చూడకుండా, వావి వరుసలు మరిచి తల్లి, బిడ్డ అని చూడకుండా చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. చాలా మండి యువకులు చిన్న పిల్లలకు మాయ మాటలు చెప్పి వారిని లోబరుచుకొని అత్యాచారాలు చేస్తున్నారు. ఇలా ఎంతో మంది మైనర్ బాలికలు మోసపోయి గర్భవతులు అవుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నల్గొండ జిల్లా ఊట్కూరు మండలం లోని ఒక గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం చాలామంది మైనర్ బాలికలు యుక్త వయసులో వారికి సరైన లోక జ్ఞానం లేకపోవడం వల్ల మాయగాల్ల చేతుల్లో మోసపోతున్నారు. ఊట్కూరు మండలం లోని ఒక గ్రామానికి చెందిన 15 ఏళ్ల వయసున్న ఒక బాలికను ఇదే విధంగా ఒక నీచుడు మాయమాటలు చెప్పి బాలికను లోబరుచుకోని మోసం చేసి అత్యాచారం చేశాడు.

మైనర్ బాలిక గ్రామంలోనే పొలం పనులకు వెళ్ళేది. అదే గ్రామానికి చెందిన నరసింహం అనే వ్యక్తి ఆ బాలికకు ఏవో మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. తల్లి తండ్రులు తిడతరనే భయం తో ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచింది.ఈ క్రమంలో 2 రోజుల క్రితం ఇంట్లో బాలిక అస్వస్థతకు గురైంది. ఆ బాలిక కుటుంబ సభ్యులు బాలికను ఆస్పత్రికి తీసుకెల్లారు. పరీక్షలు జరిపిన డాక్టర్లు బాలిక గర్భవతి నిర్ధారించి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఇది విన్న కుటుంబ సభ్యులు నివ్వెరపోయి బాలికను విచారించగా సదరు వ్యక్తి గురించి వివరించింది. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టీ సదరు వ్యక్తిని విచారించి పెళ్లి చేసుకోవాలని అడిగినా కూడా అతను నిరాకరించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.