AP News: మానవ బాంబుగా మారిన ముఖ్యమంత్రిని చంపేస్తా అంటూ పోస్టులు పెట్టిన యువకుడు అరెస్ట్!

AP News: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని చంపేస్తా రెండు రోజులుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన యువకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.మానవ బాంబుగా మారిన ముఖ్యమంత్రిని చంపేస్తానని పోస్ట్ లు పెట్టడంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి ఆ యువకుడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ ఎస్పి రాధిక మీడియాకి వెల్లడించారు.రాజమహేంద్రవరానికి చెందిన రాజాపాలెం ఫణి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి. ఈనెల 16న ట్విటర్‌లో పెట్టిన పోస్టుపై తమకు అందిన సమాచారం మేరకు విచారణ చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.

కన్నా భాయ్‌ అనే అకౌంట్‌ పేరుతో ‘మానవబాంబుగా మారి ముఖ్యమంత్రిని చంపుతానని’ ట్విటర్‌లో పోస్టు చేశాడు. అయితే, వెంటనే ఆ పోస్టు డిలీట్ చేయడమే కాకుండా క్లోజ్ చేస్తూ ఫోన్ స్విచాఫ్ చేసినట్లు ఎస్పీ రాధిక వెల్లడించారు.ఇలా నిందితుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పి రాధిక మీడియాకు వెల్లడించారు.

అరెస్టయిన నిందితులు జనసేన మద్దతుదారుడనీ తెలిపినట్లు ఈమె వెల్లడించారు.ఈ విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ ఇలాంటి పోస్టులు చేసే ఎవరిపైన తప్పకుండా చర్యలు తీసుకుంటామని అందుకే సోషల్ మీడియా వేదికగా ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు తప్పకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక తెలిపారు.