తాగుడుకు బానిస అయిన టాలీవుడ్ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీ లో చాలా మందికి మందు, సిగరెట్ లాంటి వ్యసనాలు ఉంటాయి. కానీ వాటికి బానిస అయితే మాత్రం కెరీర్ నాశనం అయిపోతుంది. అప్పటి తరం లో సావిత్రి లాంటి లెజెండరీ నటీమణులు కొందరు జీవితం లో మోసపోయి, కొన్ని చేదు అనుభవాలు ఎదురైనప్పుడు తాగుడుకు బానిస అయ్యి సర్వం కోల్పోయారు. ఇప్పుడు తాజాగా తెలుగు నటి తేజస్వి మడివాడ కూడా తాను ఒకరి కారణంగా మద్యానికి బానిస అయ్యానని షాకింగ్ న్యూస్ చెప్పింది.

‘కేరింత’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది తేజస్వి. అయితే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మంచి పేరు వచ్చింది. దాని తర్వాత ఎన్ని సినిమాలు చేసినా హీరోయిన్ గా బ్రేక్ మాత్రం ఇంకా రాలేదు.

తాజాగా ‘కమిట్మెంట్’ అనే సినిమా తో తన లక్ పరీక్షించుకోవడానికి రెడీ అయ్యింది తేజస్వి. ఈ సినిమా శృంగారం, మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నేపథ్యంలో ఉంటుందని తెలిపింది. ఈ సినిమా ట్రైలర్స్, పోస్టర్స్ లో చూసి ఇది అంతా బూతు చిత్రం అని మాత్రం అనుకోవద్దు, ఇందులో మంచి మెసేజ్ ఉంది అని తేజస్వి చెప్పింది.

ఆ మధ్య తెలుగు ‘బిగ్ బాస్’ రియాలిటీ షో లో తేజస్వి పాల్గొంది. అయితే బిగ్ బాస్ వల్ల తనకు ఒరిగింది ఏమీ లేదు అంటూ తేజస్వి షాకింగ్ కామెంట్స్ చేసింది. కానీ బిగ్ బాస్ వాళ్ళ తనకు చాలా నష్టం కలిగిందని తేజస్వి బాధ పడింది.

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకలాగా అయితే బిగ్ బాస్ మరోలాగా ఉంటుంది. చివరికి బిగ్ బాస్ హోస్ట్ అయినా నాని కూడా హౌస్ లో నన్నే తిట్టేవాడు. దీని వల్ల నేను చాలా మనోవేదనకు గురయ్యాను. నన్ను సోషల్ మీడియాలో చెత్త మిమ్స్ తో బ్యాడ్ చేశారు. కౌశల్ ఆర్మీ నన్ను ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా నన్నే టార్గెట్ చేసి మరీ టార్చర్ చేశారు.

బిగ్ బాస్ తర్వాత నేను రెండున్నర సంవత్సరాలు ఇండియా వదిలి వేరే దేశానికి వెళ్లాను. సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ చేస్తున్న ట్రోలింగ్ వల్ల నేను మందుకి బానిస అయ్యాను. ఇలాంటివన్నీ చూసి బిగ్ బాస్ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా. ఈ కమిట్మెంట్ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించింది. మళ్లీ సినిమాలలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది.