ప్రేమ పేరుతో లొంగదీసుకొని..శారీరకంగా దగ్గరై.. చివరకు..ఇలా?

ప్రేమ, పెళ్లి పేరుతో నయవంచనకు గురవుతున్నారు అమాయకపు అమ్మాయిలు. ప్రేమ, పెళ్లి మాటలు చెబుతూ సరదాలు తీర్చకుంటున్నారు. శారీరకంగా వాడుకుంటూ.. పెళ్లి పేరు చెప్పగానే మాట దాటేస్తున్నారు. మోహం చాటేస్తున్నారు.
ఇలాంటి సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చాలానే చూశాం. ఇటు మీడియా, అటు పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా.. ఈ మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు యువతులు. తాజాగా ఇలాంటి సంఘటనే హైదరాబాద్ నగరంలోని బాలా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళితే..

ప్రేమ పేరుతో బాలానగర్ కు చెందిన ఓ యువకుడు యువతిని మోసం చేశాడు. సీఐ వాహిదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం… బాలా నగర్ కు చెందిన యువతి, వీరేందర్(29)తో ఆరు నెలులగా పరిచయం ఏర్పరుచుకుని.. పెళ్లి పేరు చెబుతూ శారీరకంగా వాడుకున్నాడు. అయితే పెళ్లి చేసుకోవాలని కోరడంతో వీరేందర్ మాట దాటవేస్తున్నాడని సదరు యువతి పోలీసుకు ఫిర్యాదు చేసింది.

వీరేందర్ స్థానిక వినాయక్ నగర్ లో ఉంటూ కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. అయితే శారీరకంగా దగ్గరైన తర్వాత వీరేందర్ తనను మోసం చేశాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.