ఘోర ప్రమాదం.. 11మంది మృతి!

తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. తిరుపత్తూరు జిల్లాలోని సెంబరై ఆలయానికి వెళ్తున్న భక్తుల వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా.. 19మంది గాయపడ్డారు. మలుపు వద్ద వ్యాన్‌ని అదుపు చేయడంలో డ్రైవర్‌ విఫలమవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో వాహనంలో మొత్తం 30 మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతులంతా పులియూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.