మేజర్ సినిమా టికెట్ పై 50% రాయితీ… కేవలం వారి కోసమే?

అడవి శేషు ప్రధాన పాత్రలో నటించిన మేజర్ సినిమా విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలైన రోజు నుండి ఇప్పటివరకు మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు సాగిపోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా యూనిట్ విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్ ని ప్రకటించింది. ఇప్పటికే ఇండస్ట్రీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా విడుదలకు ముందే ప్రీమియర్ షోలు విడుదల చేశారు. అంతే కాకుండా జవాన్ల కోసం ప్రత్యేకంగా ఒక షో కూడా వేశారు.

ఇక ఇప్పుడు స్కూల్ పిల్లలు ఈ సినిమా చూడటానికి ఏకంగా టికెట్ ధరలో 50 శాతం రాయితీ ప్రకటించారు.
పాఠశాల యాజమాన్యాల కోసం ప్రత్యేకంగా షో వేస్తామని, majorscreening@gmail.comకి మెయిల్ చేసి రాయితీతో టికెట్ పొందొచ్చని మేజర్ సినిమా యూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా హీరో అడవి శేషు కూడా సోషల్ మీడియాలో ద్వారా ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇదిలా ఉండగా.. ఈ క్రమంలో అడవి శేష్ మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం 50% రాయితీ ఇవ్వటానికి గల కారణం గురించి కూడా చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలో అడవి శేషు ట్విట్టర్ వేదికగా ఒక వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోలో శేషు మాట్లాడుతూ.. ఈ సినిమాను చూసిన చాలామంది చిన్నారులు సోషల్ మీడియాలో వాయిస్ క్లిప్స్ పంపించటం, మెసేజ్ లు, ఫోన్ చేసి తాము కూడా మేజర్ సందీప్‌లా ఆర్మీ బట్టలు వేసుకొని దేశం కోసం పోరాడతామని చెబుతున్నారు. ఈ సినిమా చిన్నారులకి కూడా ఇంత నచ్చుతుందని భావించలేదు. పిల్లల నుంచి వస్తున్న స్పందన చూసి చాలా ఆనందంగా ఉంది. అందుకే ఈ సినిమాను చిన్నారుల కోసం రాయితీపై ప్రదర్శించాలని సినిమా యూనిట్ నిర్ణయించాము. గ్రూప్ టికెట్లపై పాఠశాలలకు రాయితీ కల్పిస్తున్నట్టు.. సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి గొప్ప వ్యక్తుల గురించి భవిషత్ తరాలకి తెలియాలని ఈ సినిమా చేసినట్టు అడవి శేషు చెప్పుకొచ్చాడు.