సింగరేణి బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురి మృతదేహాలు వెలికితీత

సింగరేణి భూగర్భ గనిలో పైకప్పు కూలిన ఘటన విషాదాంతమైంది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు విగత జీవులుగా మారారు. సోమవారం మధ్యాహ్నం అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్ట్‌‌లో పైకప్పు కూలడంతో ఇద్దరు అధికారులు సహా ఆరుగురు ఉద్యోగులు చిక్కుకున్నారు. వీరిలో ముగ్గురు సురక్షితంగా బయటపడగా. చైతన్యతేజ, జయరాజ్‌, శ్రీకాంత్‌ ప్రమాదం మృతిచెందారు