రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు మోదీ ఫోన్.. ఆగిన వార్!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. భారతీయుల తరలింపునకు సేఫ్ ప్యాసేజ్ కల్పించాలని కోరారు. దీంతో ఖార్కివ్ నుంచి భారతీయులు వెళ్లేందుకు 6 గంటల పాటు రష్యా వెసులుబాటు కల్పించింది. ఉక్రెయిన్ కాలమానం ప్రకారంగా సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి దాడులు జరపకూడదని.. బలగాలకు రష్యా ప్రభుత్యవ ఆదేశాలు జారీచేసింది. ఈ సమయంలోనే తక్షణమే ఖార్కివ్‌ను వదిలి వెళ్లాల్సిందిగా ఇండియన్ ఎంబసీ భారతీయులకు సూచిచింది. ఆ తర్వాత ఖార్కివ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.