గంటా 5 కోట్లు స్కామ్.. వైసీపీ ఎంపీ సంచ‌ల‌నం..!

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో జ‌రిగిన మ‌రో స్కామ్ బ‌య‌ట‌ప‌డ‌నుందా.. అంటే తాజాగా వైసీపీ ఎంపీ చేసిన వ్యాఖ్య‌లు చూస్తే అర్ధ‌మవుతోంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు పై చేసిన ఆరోప‌ణ‌లు రాజకీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

గంటా శ్రీనివాస‌రావు విద్యాశాఖ మంత్రిగా ఉన్న‌ప్పుడు, విద్యార్ధులకు సైకిళ్ళ కొనుగోళ్ళ వ్య‌వ‌హారంలో, భారీ అవినీతి జ‌రిగింద‌ని విజ‌య‌సాయి తెలిపారు. ఈ క్ర‌మంలో 12 కోట్ల రూపాయ‌ల విలువైన కొనుగోళ్ళ విష‌యంలో, గంటా శ్రీనివాస‌రావు 5 కోట్ల అవినీతికి పాల్ప‌డ్డార‌ని విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ సాక్షిగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

అంతే కాకుండా ఎస్ కె బైక్ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టినా, గంటా శ్రీనివాస‌రావు ఆ కంపెనీ నుంచే కొనుగోళ్ళు చేశార‌ని విజ‌య‌సాయి ఆరోపించారు. చివ‌రిగా బ్లాక్ మ‌నీ కోసం తుప్పు ప‌ట్టిన సైకిళ్ళ పై గంటా గ‌ణ‌గ‌ణ అంటూ సెటైర్ కూడా వేశారు. మ‌రి విజ‌య‌సాయిరెడ్డి చేసిన సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల పై గంటా శ్రీనివాస‌రావు ఎలాంటి రియాక్ష‌న్ ఇస్తారో చూడాలి. ఏది ఏమైనా చంద్ర‌బాబు అండ్ టీడీపీ బ్ర‌ద‌ర్స్‌ని వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి ‌వ‌దిలేలా లేర‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.