‘కలియుగం పట్టణంలో’ టైటిల్ పోస్టర్ విడుదల

నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా. రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ లు కలిసి సంయుక్తంగా ప్రొడక్షన్ నెంబర్ 1గా ‘కలియుగం పట్టణంలో’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. నేడు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్‌ను లాంచ్ చేశారు.

ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా చేతుల మీదుగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు రాజంపేట్ పార్లమెంట్ ఇంచార్జ్, పొలిట్ బ్యూరో మెంబర్ రెడ్డప్పగిరి శ్రీనివాసుల రెడ్డి గారు, ఏపీ ఇండస్ట్రీస్ అడ్వైజర్ రాజోలి వీర రెడ్డి గారు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగా రెడ్డి గారు, నాగార్జున స్కూల్ ఛైర్మన్ శివ శంకర్ రెడ్డి గారు, ఆర్ ఎల్ టీ గ్రూప్ చైర్మన్ అమీర్ బాబు, ఒంటేరు శ్రీనివాస్ రెడ్డి, ఏ కే జెడ్ జువెల్లర్స్ చైర్మన్ అఫ్జల్ ఖాన్, చిన్నప్ప రెడ్డి, టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోవర్దన్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. పోస్టర్ లాంచ్ చేసిన అనంతరం చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

ఈ సినిమాకు అజయ్ అరసాద సంగీతాన్ని అందిస్తుండగా.. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. గ్యారీ బీ.హెచ్. ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు.

నటీనటులు: విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్

బ్యానర్ :నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ,
నిర్మాతలు : డా.కందుల చంద్ర ఓబుల్ రెడ్డి,గడ్డం మహేశ్వర రెడ్డి, కాటం రమేష్
స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : రమాకాంత్ రెడ్డి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : చరణ్ మాధవనేని
సంగీత దర్శకుడు: అజయ్ అరసాద
ఎడిటర్: గ్యారీ బి .హెచ్ ,
ఆర్ట్ డైరెక్టర్: రవి,
స్టంట్స్ : ప్రేమ్ సన్
కొరియోగ్రాఫర్: మొయిన్ మాస్టర్
పి. ఆర్. ఓ : సాయి సతీష్