మిస్టరీ చిత్రం ట్రైలర్ విడుదల

పి.వి. ఆర్ట్స్ పతాకం పై వెంకట్ పులగం నిర్మాత గా తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో స్వప్న చౌదరి, సాయికృష్ణ హీరో హీరోయిన్ . విలక్షణ నటులు సుమన్, అలీ, తనికెళ్ల భరణి , వెంకట్ దుగ్గి రెడ్డి, రవి రెడ్డి లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘మిస్టరీ’. ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.

దర్శకుడు, హీరో తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ “కంటెంట్ ఉన్న చిత్రాలు ప్రేక్షకులకు ఎల్లప్పుడూ ఆదరిస్తారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు వెంకట్ పులగం, వెంకట్ దుగ్గి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది, టైటిల్ లాగానే మంచి మిస్టరీ థ్రిల్లింగ్ అంశాలు ఉన్న చిత్రం ఈ నెల అక్టోబర్ 13న రెండు తెలుగు రాష్ట్రలో మరియు అట్లాంటా లో విడుదల అవుతుంది. అందరికి నచ్చుతుంది” అని తెలిపారు.

హీరోయిన్ స్వప్న చౌదరి మాట్లాడుతూ “ఈ సినిమా లో నా పాత్ర కి ఆరు రకాల వెరీయేషన్స్ ఉంటాయి, అందరం కష్టపడి పనిచేశాం, టీం వర్క్ వల్లే సినిమా బాగా వచ్చింది. అందరికి నచ్చుతుంది” అని తెలిపారు.

జబర్దస్త్ ఫేమ్ – సత్య శ్రీ మాట్లాడుతూ “నేను ఒక జర్నలిస్ట్ పాత్ర చేశాను. సీనియర్ నటులతో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

సత్య శ్రీ, గడ్డం నవీన్, అకెల్లా, షన్ను, సి.కే.రెడ్డి, శోభన్ ,నేత లు నటిస్తున్న ఈ సినిమా కి కథ మాటలు- శివ కాకు,సాహిత్యం- శ్రీనివాస్ సూర్య, గానం- మనోజ్, సంగీతం- రామ్ తవ్వ , కెమెరా – సుధాకర్ బార్ట్లే, ఎడిటింగ్ – సూర్య తేజ గంజి, డాన్స్ – సాగర్.