Amala Paul: సోషల్ మీడియాని హీటేక్కిస్తున్న భామ!

Amala Paul: టాలీవుడ్‌పై హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాని హీటేక్కిస్తున్న భామ అమలా పాల్‌. అయితే.. కోలీవుడ్‌పై మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో క్లీవేజ్ షో‌తో తనవైపునకు తిప్పుకునేలా నెటిజన్లను అల్లాడిస్తోంది. సినిమా అవకాశాల కోసమే ఆమె ఈ విధంగా చేస్తుందనేలా టాక్ మొదలైన తరుణంలో.. ఇప్పుడామెను బాలీవుడ్ అవకాశం వరించింది. వివరాల్లోకి వెళితే…

అమలా పాల్‌ దక్షిణాదిలో అగ్రశ్రేణి హీరోయిన్‌గా క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే.. తన లక్ష్యం అదికాదు.. ఇంకెదోఉంది! ఎదో సాధించాలన్న పట్టుదల.. ఇంకా ఎదగాలన్న ఆరాటం ఆమెలో మెండుగా కనిపిస్తూనే ఉంది. తను అనుకున్నది సాధించే క్రమంలో దక్షిణాదిలో అగ్రశ్రేణి హీరోయిన్‌గా కొనసాగుతున్న అమలా పాల్‌ బాలీవుడ్‌లో కూడా పేరుతెచ్చుకోవాలనుకుంది. అందుకు చేయని ప్రయత్నమంటూ ఏదీలేదు. అలా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఛాన్స్ అయితే వచ్చింది మరి ఆ అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటుందో? చూడాలి అంటున్నారు ఆమె సన్నిహితులు. ఆ అవకాశమే స్టార్‌హీరో అజయ్‌ దేవగణ్‌ నటించే ‘భోళ’ చిత్రం.

అందులో అమలా పాల్‌ ది అతిథి పాత్ర అని చెబుతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. డిసెంబరు నుంచి ప్రారంభమయ్యే తదుపరి షెడ్యూల్‌ షూటింగ్‌లో అమలా పాల్‌ సెట్సుకు హాజరుకానున్నట్టు సమాచారం. దక్షిణాదికి చెందిన చాలామంది కథానాయికలు హిందీ చిత్రాల్లో నటించాలని ఉవ్విళ్లూరుతుంటారు. తమన్నా, త్రిష వంటి వారు హిందీ చిత్రాల్లో నటించగా, నయనతార ‘జవాన్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ‘ఫ్యామిలీ మేన్‌-2’ వెబ్‌ సిరీస్‌ ద్వారా సమంత బాలీవుడ్‌లో అడుగుపెట్టగా.. ఇపుడు అమలా పాల్‌ వంతు వచ్చింది. హీరో కార్తీ నటించగా ఘన విజయం సాధించిన ‘ఖైదీ’ చిత్రాన్ని అజయ్‌ దేవగణ్‌ హీరోగా హిందీలోకి ‘భోళ’ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. చూద్దాం.. అమలా పాల్‌ బాలీవుడ్ లో ఎలా నెట్టుకొస్తుందో..!!