శనివారం ఢిల్లీలోని కార్పోరేషన్ బ్యాంకులో దారుణం జరిగింది. ఉదయం 11 గంటలకు బ్యాంకు తీయగానే ఎవరి పనుల్లో వారున్నారు. ఖాతాదారులు వచ్చారు. బ్యాంకు ఉద్యోగులు అప్పుడే తమతమ పనుల్లో బిజి అవుతున్నారు. ఇంతలో నలుగురు దుండగులు బ్యాంకులో చోరికి వచ్చారు. అంతే వారి దగ్గర ఉన్న కత్తులు, తుపాకులు చూపించి అందరిని భయపెట్టారు. గాల్లోకి కాల్పులు జరిపారు.
దీంతో అంతా బతుకుజీవుడా అనుకుంటూ దుండగులకు దండం పెట్టి పక్కకు జరిగారు. అంతే వారంతా క్షణాల్లో బ్యాంకులో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు. దాదాపు కోట్లలోనే దోచుకెళ్లినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో అంతా ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దొంగలు దోచుకున్న వీడియో కింద ఉంది చూడండి.
