విభజనచట్టంలో ఆంధ్రాకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ రక రకాల వేషధారణలతో పార్లమెంటులో నిరసన తెలిపారు ఎంపీ శివప్రసాద్. ఒక్కో రోజు ఒక్కో వేషం ధరించి ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇలా చిత్రవిచిత్ర వేషధారణలతో నిరసన తెలిపిన శివ ప్రసాద్ ని ప్రశంసించారు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ. శుక్రవారం హిజ్రా వేషం ధరించిన ఎంపీ శివ ప్రసాద్ పార్లమెంట్ భవనం వద్ద నిరసన తెలుపుతున్నారు. అదే సమయంలో గాంధీజీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాలో పాల్గొనడానికి అక్కడికి వచ్చిన సోనియా పార్లమెంట్ భవనం ద్వారం నుండి బయటికి వస్తూ శివ ప్రసాద్ ని చూసి ఆయనను పలకరించారు. “గుడ్, మీరు బాగా చేస్తున్నారు. మీరు మంచి నటుడు అంటూ ఆయనను అభినందించారు సోనియా గాంధీ. శివ ప్రసాద్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు చివరి రోజు ట్రాన్స్ జెండర్ గెటప్ లో నిరసన తెలిపిన ఎంపీ శివ ప్రసాద్ “మోడీ బావా..ఏపీకి ఇచ్చిన హామీలు తీర్చవా” అంటూ తనదైన శైలిలో పాట ఆలపించారు. బీజేపీ నుండి విడిపోయాక రెండు సెక్షన్ల నుండి నేను కళాకారుడిని కాబట్టి ప్రజల్లో ఈ పోరాట స్ఫూర్తిని వేగవంతంగా తీసుకెళ్లడానికి ఇలా వివిధ వేషాలు వేస్తూ నిరసన చేస్తున్నాను. వివిధ వర్గాల వారిని రిప్రజెంట్ చేసేలా ఇప్పటివరకు వేషాలేసాను. మిగిలింది ట్రాన్స్ జెండర్ వేషమే. ఆంధ్రాలో లక్షలాదిమంది హిజ్రాలు వారున్నారు. వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో భాగమే కాబట్టి వారిని రిప్రజెంట్ చేయటానికి ఈ గెటప్ వేశాను. అని మీడియాకి తెలిపిన శివప్రసాద్ చూడు పిన్నమ్మ సాంగ్ ని మోదీ బావా అంటూ ప్యారడీ చేసి పాడారు.
“మోదీ బావా, మోదీ బావా..ప్రత్యేక హోదా ఇవ్వకుంటే నీ అంతం ఆరంభం. ఎంకన్న సాక్షిగా మాట ఇచ్చి..ఛీ..ఛీ..ఎంకన్న సాక్షిగా మాట ఇచ్చి పంగనామం పెట్టేసినావె? చంద్రబాబుకి..అబ్బా..చంద్రబాబుకి కోపం వస్తే అవుట్ అయ్యి పోతావే.. నీమీద ఒట్టు..ఔటయ్యి పోతావే..నీ మీద ఒట్టు” అంటూ మోదీ ఇచ్చిన హామీలు గుర్తు చేస్తూ గానం చేసారు.
