ఈడీ కార్యాలయానికి చేరుకున్న సోనియాగాంధీ.. అనారోగ్యంగా ఉంటే ఇంటికి వెళ్లొచ్చు!

గత కొన్ని రోజుల నుండి నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబం బాగా వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో సోనియాగాంధీకి కరోనా సంభవించడం వల్ల.. రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించారు. ఇక తాజాగా సోనియా గాంధీని కూడా విచారిస్తున్నట్టు తెలిసింది. ఇక ఈమెకు తోడుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఇక సోనియా గాంధీని ఈడీ అధికారులు విచారిస్తున్నందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. అంతేకాకుండా తమ పార్టీ కార్యాలయానికి భారీ ఎత్తుగా చేరుకున్నారు. ఇక సోనియా గాంధీకి అనారోగ్యంగా అనిపిస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఈడీ వర్గాలు చెబుతున్నాయని తెలుస్తుంది. అంతేకాకుండా తనకు మెడికల్ ఆఫీసర్ ని కూడా ఏర్పాటు చేశారు. తనను విచారించే సమయంలో తన చుట్టూ ఎవరు ఉండకుండా వారికి ప్రత్యేక రూము ఏర్పాట్లు చేశారు.