మోదీ కెసియార్ స్నేహ రహస్యం చెప్పిన రాహుల్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్, ప్రధాని నరేంద్రమోదీ స్నేహం వెనక రహస్యాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విడమర్చి చెప్పారు. శనివారం నాడు ఆయన శంషాబాద్ లో కాంగ్రెస్ ఏర్పాటుచేసిన సభలో ప్రసంగిస్తూ మోదీ అంటే కెసియార్ నిజానికి భయపడుతున్నారని అన్నారు. కెసియార్ అవినీతి చిట్టామొత్తం మోదీ చేతిలో ఉంది. అందుకే ఆయనభయపడుతున్నారు. తను సేఫ్ గా ఉండేందుకు ప్రధానిగా మోదీ కొనసాగాలనుకుంటున్నారు కెసియార్ మోదీ ఈ విధంగా మాంచి దోస్తులు. ఆందుకే కెసియార్ రాఫేల్ డీల్ ను విమర్శించడంలేదు, డీమానెటౌజేషన్ ను ప్రశంసించారు… అని రాహుల్ గాంధీ అన్నారు.

 

మోదీ నీరవ్ మోదీ  జేబులో డబ్బులేశారు,మేం పేదోళ్ల అకౌంట్ లో వేస్తాం

దేశానికి నష్టం చేసిన మోడీకి ..కేసీఆర్ మద్దతు పలుకుతున్నారన్నవిషయం విస్మరించరాదని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విప్లవాత్మక పథకం మొదలవుతుంది అది అది కనీస ఆదాయం గ్యారంటీ పథకమని అన్నారు.
‘ప్రతి పేదోడికి కనీస ఆదాయ వచ్చే పథకం తేబోతున్నాం . ప్రతి పేదవాడికి తప్పని సరి ఆదాయం అందుతుంది . దేశంలో ఉన్న ప్రతి పేదోడి ఆదాయం తగ్గకుండా ఉంటుంది అని రాహుల్ గాంధీ చెప్పారు.కుల మత ,ప్రాంత భేదాలకు తేడాలేకుండా పథకాన్ని అమలుచేస్తామని *ప్రతి ఒక్క పేదవాడి అక్కౌంట్ లో డబ్బులేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడినీ వెతికి అక్కౌంట్ ఒపెన్ చేయించి లో డబ్బులేస్తాం. మోదీ నీరవ్ మోదీ జేబులో డబ్బులేస్తే మేము పేదోడి బ్యాన్క్ అక్కౌంట్ లో డబ్బులేస్తాం అని ఆయన అన్నారు.

ఐదేళ్లు పీఎం గా ఉన్న మోడీ ..దేశాన్ని రెండుగా చీల్చారని అన్నారు.
బ్యాంక్ ల్లో వేలకోట్లు రుణం మాఫీ చేసి ధనవంతుల కోసం దేశాన్ని దోచి పెట్టారు మోడీ . మరొక వైపు రెండవ రుణమాఫీకోసం చేతులెత్తి దండం పెడుతున్న రైతులు న్నారు. వారిని మోడీ పట్టించుకోవడం లేదు. *మోడీ చెప్పిన రెండు కోట్ల ఉద్యోగాలు ఎటుపోయాయి ? దేశానికి ఇంత నష్టం చేసిన మోడీకి ..కేసీఆర్ మద్దతు పలుకుతారు,’ అని రాహుల్ అన్నారు.

రాఫెల్ తో 30వేల కోట్లు దోచి అనిల్ అంబానీ జెబులో వేశారని రాహుల్ అన్నారు. విమానాల తయారీ అనుభవం లేని అంబానీకి మోడీ రాఫెల్ విమానాలు తయారు చేసే డీల్ ఇచ్చారు.
.కార్పొరేట్ కోటీశ్వరుల కోసం కోసం మోడీ పనిచేస్తే ..మేము గరీబోళ్ల కోసం పనిచేస్తామని రాహుల్ చెప్పారు.
రాహుల్ ఇంకా ఏమన్నారంటే…
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళ రిజర్వేషన్ బిల్లు తెస్తాం, వారికి హక్కులు కల్పిస్తాం.
చత్తిస్ ఘడ్  ఎన్నికల్లో మేము రైతులు ,ఆదివాసుల కిచ్చిన హామీని అమలు చేసి చూపించాం. అలాగే ఇక్కడ కూడా కాంగ్రెస్ చెయ్యి మీకు అండగా ఉంటుంది. దేశ భక్తిడినని చెప్పే మోడీ రాఫెల్ లో ఎలా దోపిడీ చేస్తారు ? డోక్లామ్ లో చైనా ఆర్మీ చొరబడితే, డీ గుజరాత్ లో చైనా ప్రధానితోనే చాయ్ తాగుతూ కూర్చున్నారు. పుల్వామా లో తీవ్రవాదులు అటాక్ చేస్తే , మోడీ సినిమా షూటింగ్ లో నటిస్తున్నారు.ఇదేనా మోడీ దేశ భక్తి ? అని ఆయన అన్నారు.