పార్లమెంటు ఎన్నికలకు ముందు రాహూల్ గాంధీ కీలక పథకాన్ని ప్రకటించారు. ఎన్నికల వేళ పేద ప్రజలకు కీలకమైన హామీనిచ్చి రాజకీయ వేడెక్కించారు. ఇంత వరకు దేశ చరిత్రలోలేని మరియు ఏ దేశం కూడా అమలు చేయని పథకాన్ని రాహుల్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ అమలు పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఈ పథకం ద్వారా పేద ప్రజల అకౌంట్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తామన్నారు. పేదలు ఆకలితో అలమటిస్తే నవ భారతాన్ని నిర్మించలేమని రాహుల్ అన్నారు. చత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ లో జరిగిన సభలో రాహుల్ ఈ పథకాన్ని ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న పేదలకు రాహూల్ కీలక హామీనిచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలిచితే ఈ పథకాన్ని ఖచ్చితంగా అలు చేసి తీరుతామన్నారు.
ప్రపంచంలోనే ఏ దేశం అమలు చేయని పథకమని ఎక్కడైనా ఉందేమో చూపించాలని ఇతర పార్టీలకు రాహూల్ సవాల్ విసిరారు. మినిమం ఇన్ కం గ్యారంటీ స్కీం ద్వారా పేదవారికి కావాల్సిన ఆహారం, దుస్తులు , ఇతర సామాగ్రి కొనుగొలు చేసుకొని కనీసం వారు బతుకగలుగుతారని రాహుల్ అన్నారు. దేశ వ్యాప్తంగా అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారని ఆకలి చావులు లేని దేశంగా భారత్ వెలగాలని రాహుల్ ఆకాంక్షించారు.
రాహుల్ రాయ్ పూర్ సభలో ఏమన్నారంటే…
“ఈ దేశంలో అనేక మంది పేదవాళ్లు ఆకలితో చస్తున్నారు. చాలా మందికి ఉండడానికి ఇండ్లు కూడా లేవు. ప్రపంచ దేశాలకు ఆదర్శమైన భారతదేశంలో ఆకలితో చనిపోవడం చాలా బాధాకరం. ఒకప్పుడు పదిమందికి అన్నం పెట్టి ఆదర్శంగా నిలిచిన భారత్ ఇప్పుడు స్వంత దేశంలో ఉన్న వారికి అన్నం పెట్టని పరిస్థితి వచ్చింది. ఇది ఎవరి తప్పు. పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ పని చేస్తుంది. పేదరికి నిర్మూలన కోసం దేశ చరిత్రలో మరియు ప్రపంచంలోనే ఎక్కడ లేని కొత్త పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెడ్డుతుంది.
ఈ సభ సాక్షిగా హామీనిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు నిర్ధిష్ట కనీస ఆదాయం అమలు పథకాన్ని ప్రవేశపెడుతాం. దీని ద్వారా పేద ప్రజల అకౌంట్లోకి నేరుగా డబ్బులు వేస్తాం. పేదవారు తమ ఆకలిని తీర్చుకోగలుగుతారు. ఆకలితో మాడుతున్న దేశాన్ని నవభారతంగా నిర్మించలేం. అందుకే దీనిని ప్రకటిస్తున్నా. ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఈ పథకం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదు.” అని రాహుల్ గాంధీ అన్నారు. రాహూల్ గాంధీ ప్రకటనతో బిజెపి పతనం ఖాయమని కాంగ్రెస్ నాయకులు అన్నారు.
