ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి… భార్యను నగ్నంగా నడిపించిన భర్త

మనుషులలో ఏ సమయాన ఎటువంటి రాక్షసత్వం బయటపడుతుందో అర్ధం కావటం లేదు. మానవత్వ విలువలు, సాంప్రదాయాలు మరిచి ప్రవర్తిస్తున్నారు. భార్యను వేధించడమే కాకుండా నగ్నంగా నడిపించి ఆనందం పొందాడు. అలా పలుసార్లు చేయమని వేధించడంతో తట్టుకోలేని భార్య పోలీసులను ఆశ్రయించింది.

గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన ప్రదీప్ బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి హైదరాబాద్ కు చెందిన అనూపతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో కట్నంగా 15 లక్షల రూపాయలు, 12 తులాల బంగారం ఇచ్చారు. కొత్త జంట బెంగూళూరులో కాపురం పెట్టింది.  కొంత కాలం పాటు భార్యను బాగానే చూసుకున్నా ఆ తర్వాత అతని రాక్షసత్వం చూపించాడు. అనూపను నిత్యం కొడుతూ అనుమానంతో వేధించేవాడు. శారీరకంగా, మానసికంగా అనేక చిత్రహింసలు పెట్టాడు.

భార్య పై అనుమానం పెంచుకున్న పదీప్ బెడూరూంలో, కిచెన్ లో, హాల్ లో మరియు ఇంటిచుట్టూ సీసీ కెమెరాలు పెట్టాడు. అనూపను నగ్నంగా నడవమని వేధించేవాడు. ఓ సారి వేధింపులు తాళలేక కట్టుకున్న భర్త ముందే కదా అని నగ్నంగా కూడా నడిచింది. బెడూరూంలో కూడా చాలా చిత్రహింసలు పెట్టాడు. సీసీ కెమెరాలో రికార్డు అయినా వాటిని అనూపకు తెలియకుండా చూస్తూ పైశాచికానందం పొందేవాడు. 

ప్రదీప్ అక్క ప్రశాంతి, ఆమె భర్త సంజీవ్ లు కూడా అనూపను కట్నం కోసం వేధించేవారు. ఓ సారి కొట్టి అనూపను అమ్మగారింటికి పంపారు. అప్పుడు అనూప తల్లిదండ్రులు 5 లక్షలు ఇచ్చారు. దీనిని అదునుగా భావించి మరింత కట్నం తేవాలని ముగ్గురు కలిసి వేధించడం ప్రారంభించారు. అనూప ఎదురు తిరగడంతో అప్పుడు అసలు కథ చెప్పారు.

ప్రదీప్ కు ఇంతకు ముందే వివాహమైంది. ఆమెను కూడా ఇలానే వేధించడం, శారీరకంగా చిత్రహింసలు పెట్టడంతో విడాకులు తీసుకుంది. మొదటి పెళ్లి వీడియోను అనూపకు చూపించారు. మొదటి పెళ్లి తెలియకుండా దాచి పెట్టి ప్రదీప్ తో అనూప వివాహం జరిపించారు. అంతే కాకుండా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టామని, నీ నగ్న బాగోతం అంటూ వీడియోలు కూడా చూపించారు. కట్నం తేకపోతే వీటిని బయటపెడుతామని బెదిరించారు. ఖంగుతిన్న అనూప తేరుకొని జరిగిన విషయాన్ని అంతా తల్లిదండ్రులకు చెప్పింది. మోసపోయామని గ్రహించింది. 

ప్రదీప్

అనూప తల్లిదండ్రులు బెంగూళూరుకు చేరుకొని విషాయాన్ని అంతా ఆరా తీశారు. రాక్షసుల్లా ప్రవర్తించిన వారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులారా కూతురు జీవితాన్ని నాశనం చేశామని వారు కన్నీరు మున్నీరయ్యారు. అనూప భర్త ప్రదీప్ తో పాటు అతని అక్క, బావ ప్రశాంతి, సంజీవ్ కుమార్ లపై రామ్మూర్తి నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ వీడియోలు, ఇతర అనుమానాస్పద వస్తువులు వారు స్వాధీనం చేసుకున్నారు. ప్రదీప్ శాడిజాన్ని చూసి అంతా షాకయ్యారు.