కొన్ని నిమిషాల్లోనే ఆమెకు వేల మంది ఫాలోవర్స్ అయ్యారు

కొద్ది రోజుల క్రితమే ప్రియాంక గాంధీ ఏఐసీసీ కార్యదర్శిగా బాధ్యతలు  చేపట్టారు. తాజాగా ప్రియాంక గాంధీ సోషల్ మీడియాలోకి అడుగు పెట్టారు. సోమవారం ఉదయం 11.49 నిమిషాలకు ప్రియాంక గాంధీ ట్వీట్టర్ ఖాతాను తెరిచారు. దీంతో కొన్ని గంటల్లోనే ఆమెకు 45 వేల మంది ఫాలోవర్స్ అయ్యారు. ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ ఒక్క పోస్టు కూడా చేయకపోవడం గమనార్హం.

అయితే ప్రియాంక ఫాలోయింగ్ ను చూసి కాంగ్రెస్ శ్రేణులు మురిసిపోతున్నారు. కొన్ని నిమిషాల్లోనే 45 వేల మంది ఫాలోవర్స్ కావడంతో మరికొన్ని రోజుల్లో కోటి ఫాలోవర్స్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని పలువురు నేతలు అన్నారు. ప్రియాంక గాంధీ తొలి సారిగా లక్నోలో రోడ్డు షోలో పాల్గొన్నారు. వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. దీంతో కాంగ్రెస్ లో నూతనోత్తేజం ప్రారంభమైంది.