ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం యుద్ధ ట్యాంకును నడిపారు. గుజరాత్ హజీరాలోని సైనిక శిక్షణ శిబిరాన్ని సందర్శించిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రతిష్ఠాత్మక కే-9 వజ్ర అనే యుద్ధ ట్యాంకును కొద్దిదూరం పాటు నడిపారు. ఇది సెల్ఫ్ ప్రొపెల్లెడ్ యుద్ధ ట్యాంకు. ఎల్ అండ్ టీ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది.
వైబ్రంట్ గుజరాత్ సదస్సులో పాల్గొనడానికి రెండురోజుల కిందట ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్కు చేరుకున్నారు. ఈ సదస్సులో ప్రారంభ ఉపన్యాసం ఇచ్చిన అనంతరం ఆయన హజీరాకు వెళ్లారు. అక్కడ సైనిక శిక్షణ శిబిరాన్ని, ఆయుధ వ్యవస్థ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్మీ అధికారుల విజ్ఞప్తి మేరకు ఆయన కే-9 వజ్ర యుద్ధట్యాంకును నడిపారు. దాని విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
#WATCH Prime Minister Narendra Modi rides a K-9 Vajra Self Propelled Howitzer built by Larsen & Toubro pic.twitter.com/ww9B90OaiD
— ANI (@ANI) January 19, 2019