దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. అంతకు ముందు ఆయన దేశ భద్రతాధికారులతో మాట్లాడారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ఇప్పటి వరకు అమెరికా చైనా రష్యాలు మాత్రమే సాధించిన మరో ఘనతను ఇండియా కూడా సాధించిందన్నారు. అంతరిక్షంలో ఓ శాటిలైట్ ను కూల్చివేశామని, ఇంత టెక్నాలజీని సాధించిన శాస్త్రవేత్తలను అభినందిస్తున్నానన్నారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ అంశమని అన్నారు.
లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోని ఈ లైవ్ శాటిలైట్ ను ఏ-శాట్ (యాంటీ శాటిలైట్) మిసైల్ ద్వారా కేవలం మూడు నిమిషాల వ్యవధిలో కూల్చేశామని అన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతమైందని, ‘మిషన్ శక్తి’ పేరిట ఇది జరిగిందని అన్నారు. ఇకపై ఎటువంటి లక్ష్యాన్ని అయినా ఛేదించగల శక్తి ఇండియాకు వచ్చినట్టేనని అన్నారు. స్పేస్ పవర్ దేశాల్లో ఇప్పుడు ఇండియా కూడా చేరిందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
