దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ ముఖ్యమైన మార్గాల్లో ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
1. చర్లపల్లి – తిరుపతి వీక్లీ స్పెషల్
రైలు నెం. 07011 (చర్లపల్లి నుంచి తిరుపతికి): సెప్టెంబరు 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది.
రైలు నెం. 07012 (తిరుపతి నుంచి చర్లపల్లికి): సెప్టెంబరు 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది.
ప్రధాన స్టేషన్లు: మల్కాజ్గిరి, కాచిగూడ, మహబూబ్నగర్, కర్నూలు సిటీ, గుత్తి, కడప, రేణిగుంట.
2. తిరుపతి – హిసర్ వీక్లీ స్పెషల్
రైలు నెం. 07717 (తిరుపతి నుంచి హిసర్కు): అక్టోబరు 1 నుంచి నవంబరు 26 వరకు ప్రతి బుధవారం బయలుదేరుతుంది.
రైలు నెం. 07718 (హిసర్ నుంచి తిరుపతికి): అక్టోబరు 5 నుంచి నవంబరు 30 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది.
ప్రధాన స్టేషన్లు: రేణిగుంట, కడప, కర్నూలు సిటీ, కాచిగూడ, నిజామాబాద్, నాందేడ్, అకోలా, భుస్వాల్, వడోదర, రత్లం, అజ్మీర్.
3. నాందేడ్ – ధర్మవరం వీక్లీ స్పెషల్
రైలు నెం. 07189 (నాందేడ్ నుంచి ధర్మవరం): సెప్టెంబరు 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది.
రైలు నెం. 07190 (ధర్మవరం నుంచి నాందేడ్): సెప్టెంబరు 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది.
ప్రధాన స్టేషన్లు: నిజామాబాద్, కరీంనగర్, వరంగల్లు, ఖమ్మం, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, మదనపల్లి.
4. బెంగళూరు – బీదర్ స్పెషల్ సర్వీసులు
రైలు నెం. 06549/06550: బెంగళూరు నుంచి ఈనెల 26న, బీదర్ నుంచి 27న ఒక్కో ట్రిప్పు నడుస్తాయి.
రైలు నెం. 06530/06540: సెప్టెంబరు 5 నుంచి 29 వరకు ఈ రైళ్లు శుక్ర, ఆదివారాల్లో బెంగళూరు నుంచి, శని, సోమవారాల్లో బీదర్ నుంచి నడుస్తాయి.
ప్రధాన స్టేషన్లు: యల్హంక, హిందూపురం, ధర్మవరం, గుంతకల్లు, రాయచూరు, వాడి, కలబురగి.
5. యశ్వంతపూర్ – ధన్బాద్ వీక్లీ స్పెషల్
రైలు నెం. 06563 (యశ్వంతపూర్ నుంచి ధన్బాద్): ఈ నెల 23 నుంచి డిసెంబరు 27 వరకు ప్రతి శనివారం నడుస్తుంది.
రైలు నెం. 06564 (ధన్బాద్ నుంచి యశ్వంతపూర్): ఈ నెల 25 నుంచి డిసెంబరు 29 వరకు అందుబాటులో ఉంటుంది.
ప్రధాన స్టేషన్లు: ధర్మవరం, అనంతపురం, కర్నూలు సిటీ, కాచిగూడ, ఖాజీపేట్, బాలార్షా, నాగపూర్, ఇటార్సి, ప్రయాగరాజ్, గయ.
ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రయాణ తేదీలకు అనుగుణంగా ముందుగానే టికెట్లు రిజర్వ్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం రైల్వే అధికారిక వెబ్సైట్ లేదా యాప్ను సంప్రదించగలరు.


