వైద్యం పేరుతో తల్లిదండ్రులను నమ్మించి బాలికపై అత్యాచారానికి పాల్పడిన భూత వైద్యుడు..!

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పటికీ అక్కడక్కడ కొంతమంది ప్రజలు మూఢనమ్మకాల పట్ల విశ్వాసం చూపుతున్నారు. చదువుకున్నవారు చదువుకోని వారు అని తేడా లేకుండా విద్యావంతుడు కూడా మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. ఇలా దొంగ బాబాలను నూత వైద్యులను నమ్మి చాలామంది మోసపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చినప్పటికీ ప్రజలకు ఇంకా వాటిపట్ల నమ్మకం పోలేదు. ఇటీవల కూతురికి అనారోగ్యంగా ఉండటం వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా నయం కాకపోవటంతో బోధ వైద్యుణ్ని ఆశ్రయించిన తల్లిదండ్రులకు షాకింగ్ ఘటన ఎదురు అయింది.

వివరాలలోకి వెళితే…ఉత్తర ప్రదేశ్‌లోని కౌశాంబిలో నివాసం ఉంటున్న దంపతులు తమ కుమార్తెకు మూర్చ వ్యాధి రావడంతో అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించిన కూడా తెలిసిన వ్యక్తుల ద్వారా ఒక భూత వైద్యని సంప్రదించారు. ఆ భూత వైద్యుడు బాలిక దుష్టశక్తులు ఆవహించటం వల్ల ఇలా అనారోగ్యం పాలు అయిందని ఆ దంపతులను నమ్మించాడు. ఆ తర్వాత వైద్యం పేరుతో బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అనారోగ్యంగా ఉన్న ఆ మైనర్ బాలికపై హత్యాచారం చేశాడు. డిసెంబర్ 24వ తేదీన ఈ ఘటన జరగగా ఆ బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చి జరిగిన విషయం తన తల్లి తండ్రులకు చెప్పింది.

దుష్టశక్తులు తొలగిస్తానని ఆ దంపతులను నమ్మించి అభం శుభం తెలియని మైనర్ బాలిక మీద అత్యాచారం చేయడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన భూత వైద్యుడు మీద దాడి చేసి పోలిసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనారోగ్యంగా ఉంటే ఆస్పత్రిలో చుపించుకోవాలని ఇలాంటి భూత వైద్యం చేస్తామని నమ్మించే దొంగ బాబా లను నమ్మి మోసపోవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.