International Monetary Fund: యుద్ధ వాతావరణంలో పాకిస్థాన్ కు అప్పు ఇచ్చిన ఐఎంఎఫ్

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో పాక్‌కు ఇప్పటివరకు అందిన మొత్తం సహాయం సుమారు 2.1 బిలియన్ డాలర్లకు చేరింది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే IMF ఆర్థిక సంస్థ నుంచి నిధులు వస్తున్నాయని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉత్సాహంగా ప్రకటించారు.

భారత్ అనుసరిస్తున్న వ్యూహాలు విఫలమయ్యాయని ఆయన వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగించింది. కానీ, ఈ డబ్బు నిజంగా పాకిస్థాన్ ప్రజలకు ఉపయోగపడుతుందా? దాని ఉగ్రపట్టు మరింత బలపడుతుందా? అన్నది అంతర్జాతీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఐఎంఎఫ్ నిర్ణయానికి భారత్ తిప్పికొట్టినట్లే తిప్పికొట్టింది. పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగే ఉగ్రవాద కార్యకలాపాలను ఆర్థికంగా ప్రోత్సహించే ప్రమాదం ఉందని భారత్ చిప్పింది.

అందుకే ఆ మంజూరుకు జరిగిన ఓటింగ్ ప్రక్రియకు భారత్ దూరంగా ఉండడం గమనార్హం. ఎందుకంటే పాకిస్థాన్‌లో జనం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఆ డబ్బు వారికోసం ఉపయోగపడుతుందో లేదో అనేది ఎవరూ చెప్పలేరు. కానీ ఆ డబ్బు మళ్లీ ఆయుధాల కోసం, డ్రోన్ల కోసం, భారత్‌పై దాడుల కోసం ఉపయోగపడే అవకాశమే ఎక్కువ అన్నది చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం.

ఇది ఊహ కాదు. ఐఎంఎఫ్ డబ్బు ఆమోదం ప్రకటించిన అదే రోజున, పాక్ సైన్యం మూడో రాత్రి కూడా పశ్చిమ భారతదేశంలోని సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్లతో, క్షిపణులతో దాడులు చేసింది. ఫిరోజ్‌పూర్‌లోని నివాస ప్రాంతంలో డ్రోన్ దాడి జరిగి ముగ్గురు పౌరులు గాయపడటం ఆందోళనకరం. ఇదే ముందు రెండు రోజుల్లో కూడా పాక్ ఇలాంటి దాడులు చేసిందని భారత ప్రభుత్వం ప్రకటించింది. అంటే సహాయం ఒక్కసారిగా సైనిక దూకుడు పెంచేందుకు ఉపయోగపడుతుందా? అన్న అనుమానాలు తారాస్థాయికి చేరాయి.

Public Reaction On Ys Jagan Padayatra 2.0 || Ap Public Talk || Chandrababu || Pawan Kalyan || TR