వరద బాధితులకు రెండు లక్షల విరాళం ఇచ్చిన ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ టీమ్!

గత కొన్ని రోజుల నుండి తెలుగు రాష్ట్రాలలో వరదలు బాగా ముంచుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమ్మ జిల్లా వరద బాధితులను ఆదుకోవడానికి ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ సినీ బృందమైన నిర్మాత అట్లూరి నారాయణరావు, హీరో ఉదయ్ శంకర్ తమ వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు.

మంత్రి పువ్వాడ అజయ్ సపోర్టుతో మంత్రి కేటీఆర్ ను కలిసి రెండు లక్షల చెక్కును అందించారు. ఇక ప్రజలు కష్టాల్లో ఉన్నందుకు ఈ సినీ బృందం తమ సహాయంతో ముందుకు రావడంతో కేటీఆర్ వారిని అభినందించారు. ఇక సినీ పరిశ్రమకు చెందిన వాళ్లే కాకుండా పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలి అని కోరారు కేటీఆర్.