ప్రేమికుల దినోత్సవం రోజు ప్రియురాలికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు.. కట్ చేస్తే కటకటాల్లోకి..?

ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ప్రేమికుల దినోత్సవం రోజు తమ ప్రియమైన వారికి కానుకలు ఇవ్వాలని అనుకుంటారు. అయితే ప్రేమికుల దినోత్సవం రోజు ప్రేయసికి కానుక ఇవ్వాలని భావించిన ఒక యువకుడు చివరికి కటకటాల పాలయ్యాడు.

వివరాల్లోకి వెళితే… తమిళనాడులోని బీరంగి మేడు గ్రామానికి చెందిన 20 ఏళ్ల అరవింద్ రాజ్ అన్ యువకుడు కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీ లో ఓ అమ్మాయిని వన్ప్రేమిస్తున్నాడు. ఈ లవర్స్ డే నాడు ఆమెకు గిఫ్ట్ ఇచ్చి.. తన ప్రేమను చెప్పేయాలని డిసైడ్ అయ్యాడు. దీంతో తన ఫ్రెండ్ ని డబ్బులు అడిగాడు. అయితే అతని దగ్గర కూడా లేకపోవటంతో డబ్బు కోసం ఏం చేయాలా అని ఆలోచించారు. డబ్బు కోసం ఇద్దరు కలిసి రేణుక అనే మహిళకు చెందిన మేకల గుంపు నుంచి ఓ మేకను మాయం చేయాలని ఫిక్స్ అయ్యారు.

దీంతో మలయరాన్ కుప్పం గ్రామంలో ఆమె మేకల్ని గడ్డి మైదానంలోకి తీసుకెళ్లగా… అక్కడ చాటుగా వచ్చి ఓ మేకను పట్టుకున్నారు. వెంటనే అది అరవడం మొదలుపెట్టింది. దాంతో మేకను ఎత్తుకుపోవటం గమనించిన రేణుక గట్టిగా అరుస్తూ వారి వెంటపడింది. ఆ ఇద్దరూ మేకని తీసుకొని స్పోర్ట్స్ బైక్ ఎక్కి పారిపోవాలని చూశారు. కానీ ఆమె అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకొని బైక్ ముందుకు వెళ్లకుండా చుట్టుముట్టి ఇద్దర్నీ పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులుఇద్దర్నీ అరెస్టు చేసి వారి బైక్‌ని సీజ్ చేశారు. ఇద్దరి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా గిఫ్ట్ కోసం చోరీ చేసి.. జైలుపాలయ్యారు.