దేశవ్యాప్తంగా ఘనంగా 70 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

దేశవ్యాప్తంగా ఘనంగా 70 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ జెండావిష్కరణ చేసి సైనిక గౌరవ వందనం స్వీకరించారు. భారత ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ మున్ముందు అన్ని రంగాల్లో దూసుకెళ్లాలని వారు ఆకాంక్షించారు. 

ఏపీ, తెలంగాణలో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.