Parliament News: బ్రేకింగ్ న్యూస్: చట్టసభల్లో పెరగనున్న స్థానాలు – కేంద్రం సంచలన నిర్ణయం!

Parliament News: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. లోక్‌సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% మేర పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే సంబంధిత బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తు పూర్తయింది.

సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడమే లక్ష్యంగా, 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఈ పెంపును చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియ వేగంగా పూర్తయ్యి, 2029 సార్వత్రిక ఎన్నికల నాటికే పెరిగిన స్థానాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

కీలక మార్పులు ఇవే:
లోక్‌సభ స్థానాలు: ప్రస్తుతం ఉన్న 543 స్థానాల సంఖ్య 816కి పెరగనుంది.

మహిళా రిజర్వేషన్: పెరిగిన స్థానాల్లో సుమారు 273 స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది.

రాష్ట్రాల వారీగా నిష్పత్తి: దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు నష్టం కలగకుండా అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా 50% సీట్లను పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది.

తెలుగు రాష్ట్రాలపై ప్రభావం (అంచనా): కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి.

ఎందుకు ఈ నిర్ణయం?
నిజానికి నియోజకవర్గాల పునర్విభజన 2026 తర్వాత జరిగే తొలి జనాభా లెక్కల ఆధారంగా జరగాల్సి ఉంది. అయితే, ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆగితే మహిళా రిజర్వేషన్ల అమలు 2034 వరకు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. అందుకే, 2011 సెన్సస్ ఆధారంగా సీట్లను పెంచి, ప్రస్తుత రాజకీయ నేతలకు (పురుష ప్రతినిధులకు) ఇబ్బంది కలగకుండా అదనపు సీట్లను మహిళా కోటా కింద భర్తీ చేసే ‘విన్-విన్’ వ్యూహాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది.

ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే, వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సరిహద్దులు మారిపోవడమే కాకుండా, కొత్త నాయకత్వానికి పెద్దపీట పడనుంది.

Why is Chiranjeevi Being Targeted So Much..? Chillagattu Sreekanth | Pawan Kalyan | Telugu Rajyam