ఐసీయూలో చికిత్స పొందుతున్న బాలిక పై సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొంత మంది వ్యక్తులు.. ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న బాలిక పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  యూపిలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు పాము కరవడంతో బరేలి ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతుంది.

అర్ధారాత్రి బాలిక ఉన్న గదికి డ్యూటిలో ఉన్న యూనిఫాం వేసుకున్న వ్యక్తితోపాటు మరో ముగ్గురు వచ్చారు. బాలిక చేతులు కట్టేసి నలుగురు దారుణానికి పాల్పడ్డారు. చుట్టూ పరదలు ఉండటంతో అఘాయిత్యాన్ని ఎవరు కూడా గమనించలేకపోయారు. బాలిక కూడా నిస్సహాయ స్థితిలో ఉండటంతో నిందితులు దారుణానికి పాల్పడ్డారు.

సిసి టివి ఫుటేజిలు గమనించిన పోలీసులు కాంపౌండర్ సునీల్ తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బాలిక పై ఏ మాత్రం శ్రద్ద లేకుండా ప్రవర్తించిన హస్పిటల్ సిబ్బందిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.