పట్టపగలు బస్టాండ్ లో గ్యాంగ్ స్టర్ ఎన్ కౌంటర్ (వీడియో)

పట్టపగలు మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే ఓ రౌడీషీటర్ ను పోలీసులు నడి రోడ్డు పై కాల్చి చంపారు. బీహార్ లోని ముజప్ఫర్ బస్టాండ్ లో ఈ ఘటన జరిగింది. సుశీల్ మాన్ సుంగ్ అనే వ్యక్తి ముజప్ఫర పూరలో గత కొంత కాలంగా అరాచకాలు చేస్తూ గ్యాంగ్ స్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అతనిని పోలీసులు పలుసార్లు హెచ్చరించినా కూడా మార్పు రాలేదు. మహిళల పై రేప్ లు చేయడం, వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నాడు. దీంతో సుశీల్ తీరుతో విసిగిన పోలీసులు షూట్ ఆర్డర్లు జారీ చేశారు.

శనివారం మధ్యాహ్నం సుశీల్ తన కుటుంబ సభ్యులతో కలిసి బస్సులో వెళుతున్నాడన్న పక్కా సమాచారం పోలీసులకు అందింది. దీంతో క్షణాల్లో బస్సును పోలీసులు రౌండప్ చేశారు. సుశీల్ ను లొంగిపోవాలని కోరగా అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తన వద్ద ఉన్న తుపాకీతో పోలీసుల పైకి కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ముజఫ్పర్ పై కాల్పులు జరిపారు. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బీహార్ లో కలకలం సృష్టించింది.   ఎన్ కౌంటర్ వీడియో కింద ఉంది చూడండి.