స్వచ్ఛత అవార్డు అందుకున్న ఐఏఎస్ ఆమ్రపాలి

స్వచ్చతలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో ఉత్తమంగా నిలిచింది. గాంధీ జయంతి సందర్బంగా ఢిల్లీలో జరిగిన స్వచ్చతా దివస్ లో పురస్కారాలను కేంద్ర మంత్రి ఉమాభారతి అందజేశారు. దక్షిణాది రాష్ట్రాల విభాగంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. జిల్లాల విభాగంలో పెద్దపల్లి దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాలలో ఫస్టు ప్లేసులో ఉండి తన సత్తాను చాటింది.

అవార్డు అందుకుంటున్న పెద్దపల్లి కలెక్టర్ దేవసేన

వరంగల్ 95.59 పాయింట్లతో 9 వ స్థానం, జగిత్యాల 15, సిరిసిల్ల 85, కరీంనగర్ 91 స్థానాల్లో నిలిచాయి. దక్షిణాదిలో రెండో స్థాయి సాధించిన పురస్కారాన్ని పంచాయతీ రాజ్ కార్యదర్శి వికాస్ రాజ్, నీతూకుమారి ప్రసాద్ అందుకున్నారు. పెద్దపల్లి పురస్కారాన్ని కలెక్టర్ దేవసేన అందుకున్నారు. వరంగల్ పురస్కారాన్ని ఆమ్రపాలి, చార్మినార్ అవార్డును ఫారూఖీ, శ్రీనివాస్ లు అందుకున్నారు.

అవార్డు అందుకుంటున్న నీతూకుమారి ప్రసాద్