ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. నలుగురు మృతి

మహారాష్ట్ర సోలాపుర్‌లో​ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 16మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సోలాపుర్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దైవ దర్శనం కోసం పంఢర్​పుర్‌కు భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్​ సోలాపుర్​-పుణె హైవేపై ఓ ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు టైర్​ పేలిపోవడంతో డ్రైవర్​ నియంత్రణ కోల్పోవటం వల్ల అది ట్రాక్టర్‌ను వేగంగా ఢీకొట్టింది.