36 గోవులు ఒకేసారి రైలుకింద‌! అనుమానాలెన్నో!

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. రైలు ఢీ కొన్న ఘ‌ట‌నలో ఒకేసారి 36 గోవులు దుర్మ‌ర‌ణం పాల‌య్యాయి. హ‌మీర్‌పూర్ జిల్లాలోని రాగౌల్ రైల్వేస్టేష‌న్ స‌మీపంలో శుక్ర‌వారం ఓ వంతెనపై ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వంతెన దాటుతున్న గోవుల‌పై రైలు దూసుకెళ్లి ఉంటుంద‌ని స్థానికులు భావిస్తున్నారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే రైల్వే అధికారులు, స్థానిక మున్సిప‌ల్ సిబ్బంది హుటాహుటిన సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. గోవుల క‌ళేబ‌రాల‌ను సామూహికంగా ఖ‌న‌నం చేశారు. దీనిపై స్థానిక గోసంర‌క్షకులు అనుమానాలు వ్య‌క్తం చేశారు. గోవుల‌ను చంపి, ప్ర‌మాదంగా చిత్రీక‌రించి ఉంటార‌ని ఆరోపిస్తున్నార‌. ఈ ఘ‌ట‌న‌పై వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.