ఆ ఆస్పత్రిలో 1000 మంది చిన్నారులు చనిపోయారు

అవును మీరు విన్నది నిజమే. ఆ ఆస్పత్రిలో ఇప్పటి వరకు దాదాపు 1000 మంది చిన్నారులు చనిపోయారు. అదానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుజరాత్ లోని కఛ్ జిల్లా బూజ్ పట్టణంలో జీకే ఆస్పత్రి నడుస్తోంది.

క్వశ్చన్‌ అవర్‌ సయమంలో ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి నితిన్‌ పటేల్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. జీకే ఆస్పత్రిలో గడిచిన ఐదేళ్ల కాలంలో 1,018 మంది చిన్నారులు చనిపోయినట్టు తెలిపారు. 2014-15లో 188 మంది, 2015-16లో 187 మంది, 2016-17లో 208 మంది, 2017-18లో 276 మంది, 2018-19(ఇప్పటివరకు) 159 మంది చిన్నారులు చనిపోయినట్టు వెల్లడించారు.

 జీకే ఆస్పత్రిలో చిన్నారుల మరణాలపై దర్యాప్తు చేపట్టడానికి గత ఏడాది మే నెలలో కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కమిటీ తన నివేదికలో పిల్లల మరణాలకు వేర్వేరు కారణాలను పేర్కొందన్నారు. చనిపోయినవారిలో ఆ ఆస్పత్రిలో జన్మించిన శిశువులతోపాటు, అక్కడికి రిఫర్‌ చేయబడిన చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు.