“యాత్ర 2” పై డైరెక్టర్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడా?

రీసెంట్ గా టాలీవుడ్ లో అనౌన్స్ అయ్యిన అవైటెడ్ పొలిటికల్ సీక్వెల్ చిత్రం “యాత్ర 2”. మహా నేత వై ఎస్ ఆర్ జీవిత చరిత్రపై సరిగ్గా గత ఎన్నికల ముందు రిలీజ్ చేసిన యాత్ర కి అయితే సీక్వెల్ గా చేస్తున్న ఈ చిత్రం ఇపుడు అనౌన్స్ అయ్యింది.

మరి ఈ సినిమాలో అయితే అటు వై ఎస్ పాత్రలో మమ్ముట్టితో పాటుగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్ర కూడా కనిపిస్తుంది అని పోస్టర్ లోనే కన్ఫర్మ్ చేశారు. అయితే ఆ హీరో ఎవరు అనేది ఇప్పటికి సస్పెన్స్ కాగా ఇప్పుడు ఈ సినిమాపై దర్శకుడు మహి వి రాఘవ ఓ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఇపుడు సినీ వర్గాల్లో టాక్ వైరల్ గా మారింది.

అయితే మహి వి రాఘవ ఈ చిత్రాన్ని ఎన్నికల లోపే కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలి అని లేకపోతె ఆ వచ్చే కొన్ని డబ్బులు కూడా రావు అని చెప్పాడట. అంటే ఇన్ డైరెక్ట్ గా ఈ చిత్రాన్ని కేవలం పొలిటికల్ స్టంట్ గా మాత్రమే తీస్తున్నారు అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మరి ఎన్నికల ముందు వచ్చే ఈ సినిమా ఎలాంటి పెర్ఫామెన్స్ ని చేస్తుందో చూడాలి.

కాగా ఈ చిత్రంలో అయితే వై ఎస్ జగన్ పాత్రకి అక్కినేని నాగార్జున పేరు కూడా అంటున్నారు బట్ తమిళ హీరో జీవా ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అని తెలుస్తుంది. కాగా ఈ చిత్రంకి పాన్ ఇండియా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే యూవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.