Prabhas: రూ.2 కోట్ల బడ్జెట్ తొనూ రాధే శ్యామ్ సాధ్యమే: ప్రభాస్ షాకింగ్ కామెంట్స్

Prabhas: దాదాపు మూడేళ్ళ వెయిటింగ్ తర్వాత విడుదలైన మూవీ రాధే శ్యామ్. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. ప్రేమ గెలుస్తుందా, డెస్టినీ గెలుస్తుందా అన్న కథాంశంతో తీసిన ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే కథానాయికగా వ్యవహరించారు.

ఇకపోతే దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన రాధే శ్యామ్ సినిమాపై పలువురు పలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాని అంత బడ్జెట్ లో తీయాల్సిన అవసరం లేదని కొందరు అంటే, తక్కువ బడ్జెట్ తోనూ ఈ సినిమా తీయొచ్చని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఐతే ఇదే విషయంపై రాజమౌళి అడిగిన ప్రశ్నకు రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు. అందరూ అనుకుంటున్నట్లు ఈ సినిమాను రూ.2 కోట్ల బడ్జెట్ లోనూ తీయోచ్చని ఆయన చెప్పారు. కానీ డైరెక్టర్ తనకు ఈ కథను చెప్పినపుడు పలు సీన్లను గొప్పగా తీయాలని భావించినట్టు ఆయన తెలిపారు. అదే సమయంలో మంచి నిర్మాతలు కూడా దొరకడంతో ట్రైన్ మరియు షిప్ ఎపిసోడ్ లను గ్రాండ్ గా తీయాలని అనుకున్నట్టు ఆయన చెప్పారు. అలా రాధే శ్యామ్ సినిమా భారీ బడ్జెట్ సినిమా అయిందని ఆయన స్పష్టం చేశారు.

కానీ ఫైనల్ కి వచ్చే సరికి ట్రైన్ సీన్ మరియు షిప్ సీన్ లు అనుకున్నా స్థాయిలో లేవని ప్రేక్షకుల నుంచి కామెంట్స్ వచ్చాయి. ఇంకా మెరుగ్గా తీస్తే బాగుండేదేమో అన్న టాక్ ప్రస్తుతం వినిపిస్తుంది. ఐతే రాధే శ్యామ్ సినిమాకి కలెక్షన్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి పొజిషన్ లోనే ఉన్నా, హిందీ వెర్షన్ రాధే శ్యామ్ చాలా దారుణంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో భారీ నష్టాలు తప్పవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.