సాయి ధరమ్ తేజ్.. అందుకే, చెప్పి చేయాలి సాయం.!

సాయి ధరమ్ తేజ్ కొన్నాళ్ళ క్రితం యాక్సిడెంట్ బారిన పడ్డాడు. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. యాక్సిడెంట్ బారిన పడ్డ సాయి ధరమ్ తేజ్ గురించి అంబులెన్స్‌కి సమాచారమిచ్చాడు ఓ యువకుడు.

ఆ యువకుడు తాజాగా వార్తల్లోకెక్కాడు. ఆ ఘటన తర్వాత తనను కొందరు వేధించారనీ, దాంతో చేస్తున్న పని మానేసి వేరే పని వెతుక్కోవాల్సి వచ్చిందని సదరు యువకుడు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.

మరోపక్క, సాయి ధరమ్ తేజ్ తరఫున ఆ యువకుడికి ‘ఆర్థిక సాయం’ అందినట్లుగా కూడా వార్తలొచ్చాయి. దీనిపై సదరు యువకుడు స్పందిస్తూ, తనకెలాంటి సాయం అందలేదని చెప్పాడట.

ఈ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ అవడంతో సాయి ధరమ్ తేజ్ స్పందించక తప్పలేదు. తన టీమ్‌ని సంప్రదిస్తే, అవసరమైన సాయం చేస్తారని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సదరు యువకుడికి ఇంతకు ముందే సాయం అందిందిట. అయితే అది అనధికారికం.

దానికి లెక్కలు, ఆధారాల్లేకపోవడంతో.. ఇప్పుడు ఇంకోసారి సాయం చేయక తప్పట్లేదని తెలుస్తోంది. సాయం చేస్తే సరిపోదు, పబ్లిసిటీ కూడా చేసుకోవాలి ఈ రోజుల్లో.!