చిరంజీవి వదిలేసింది ఇంకా ఎక్కువే.!

మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ నిర్మాతల ఫ్రెండ్లీనే. ఫ్యాన్స్ తనని ఎలా ఇష్టపడతారో చూస్తూనే, తన కారణంగా నిర్మాతలు ఎటువంటి నష్టాలూ పడకూడదని ఆలోచిస్తూంటారు ‘ఆచార్య’ విషయంలోనే ఆయన లెక్క తప్పయ్యింది. అయినా, తన వంతుగా నష్టపోయిన వారికి ఆ నష్టం పూడ్చే బాధ్యత తీసుకున్నారు చిరంజీవి.

ఇక, ఇప్పుడు ‘భోళా శంకర్’ విషయంలో జరిగిన ట్రేడింగ్ దుష్ర్పచారం సంగతి తెలిసిందే. వాస్తవానికి చిరంజీవి ముందుగా అనుకున్న రెమ్యునరేషన్ అందుకోలేదనీ ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం. ఆ క్రమంలోనే పది కోట్లు చిరంజీవి వదిలేసుకున్నట్టు గాసిప్ బయటికి వచ్చింది. కానీ, అది పది కోట్లు కాదట. ఇంకా ఎక్కువేనట. 15 నుంచి 20 కోట్ల వరకూ అయ్యుండొచ్చని అంటున్నారు.

అయితే, ఆ లెక్కలు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పారట చిరంజీవి. సినిమా రిలీజ్‌కి ముందే దాదాపు 25 కోట్ల వరకూ నిర్మాత అనిల్ సుంకర, చిరంజీవికి ముట్టచెప్పాల్సి వుందట తెర వెనక ఇంత జరుగుతుంటే, మరి, దుష్ప్రచారమెలా జరిగింది.? పనిగట్టుకుని, ‘భోళా శంకర్’ మీద దుష్ప్రచారం చేయించారని అనిల్ సుంకరకి సమచారం అందిందిట. అదీ సంగతి.