ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా, ట్రెండ్ సెట్టర్గా వెలుగొందిన పూజా హెగ్డే… ఇప్పుడు వరుస పరాజయాలతో కెరీర్లో తడబడుతోంది. సౌత్ సినిమాల్లో స్టార్ హీరోల సరసన వరుసగా హిట్లు కొడుతూ టాప్ లీగ్లో నిలిచిన పూజా, ఇప్పుడు అదే టాప్ హీరోల సినిమాల్లో భాగమైనా విజయం మాత్రం సాధించలేకపోతుంది. ‘అల వైకుంఠపురములో’ తర్వాత వచ్చిన ప్రతీ సినిమా ఆమెను వెనక్కి నెట్టేసింది.
ప్రభాస్తో ‘రాధేశ్యామ్’, చిరంజీవితో ‘ఆచార్య’, విజయ్తో ‘బీస్ట్’, బాలీవుడ్లో ‘సర్కస్’, ‘కిసీ కా భాయ్..’ చిత్రాలు వరుసగా ఫ్లాప్స్ అయ్యాయి. ఇప్పుడు తమిళంలో ‘రెట్రో’తో మళ్లీ ఫామ్ లోకి రావాలనుకుంది. కానీ అక్కడ కూడా పరిస్థితి అనుకూలంగా లేదు. మొదట రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చినా… కథన తీరుపై విమర్శలు రావడంతో మౌత్ టాక్ మిశ్రమంగా మారిపోయింది. తెలుగు ప్రేక్షకులు అయితే మొదటి రోజే నిరాశ వ్యక్తం చేశారు.
ఆరు వరుస ఫెయిల్యూర్స్ తర్వాత వచ్చిన ‘రెట్రో’పై ఎంతగానో ఆశ పెట్టుకున్న పూజాకు ఇది ఏడో ఫ్లాప్ గా మిగిలే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే ట్రాక్ కొనసాగితే ఆమెకు భవిష్యత్తులో పెద్ద ప్రాజెక్టులు దొరకడం కష్టమే. దర్శక నిర్మాతలు ఇప్పటికే కొత్త తరం నటీమణుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో పూజా మళ్లీ తెలుగు ఇండస్ట్రీపై ఆశలు పెట్టుకుంటున్నట్టు సమాచారం. ఓ ప్యూర్ లవ్ స్టోరీ ద్వారా తిరిగి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందట. గతంలో ఆమెకు గుర్తింపు తెచ్చిన సినిమాలు తెలుగు నుంచే కావడంతో, మళ్లీ ఇక్కడే రీ ఇమేజ్ సాధించాలనుకుంటోంది. అలాగే తలపతి విజయ్ నెక్స్ట్ సినిమాలో తనే హీరోయిన్. మరి ఆ సినిమా ఎలాంటి క్రేజ్ తెస్తుందో చూడాలి.