కథ వినకుండానే వీర సింహారెడ్డి సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్…. ఎవరంటే?

బాలకృష్ణ హీరోగా,శృతిహాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేనీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వీర సింహారెడ్డి.ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఈ సినిమా ఎంతో ఘనంగా ప్రీరిలీజ్ వేడుకని కూడా జరుపుకుంది. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య సరసన మొదటిసారిగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించారు.ఇక ఈ సినిమాలో శృతిహాసన్ కన్నా ముందుగా మరొక హీరోయిన్ ని సంప్రదించారట. అయితే ఆ హీరోయిన్ మాత్రం కథ కూడా వినకుండానే బాలయ్య పక్కన అనడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేసారట.

ఈ విధంగా బాలకృష్ణ సినిమా అనగానే కథ కూడా వినకుండా వీర సింహారెడ్డి సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే… ఆ హీరోయిన్ మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార. నయనతార ఇదివరకే బాలకృష్ణ నటించిన సింహ సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఇక వీర సింహారెడ్డి సినిమాలో నయనతార అయితే తనకు లక్కీ హీరోయిన్ అని భావించిన బాలకృష్ణకి తీవ్ర నిరాశ కలిగించింది.

ఇక బాలకృష్ణ సరసన నయనతార నటించకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఈమె పెళ్లి తర్వాత పలు సినిమాలకు కమిట్ అయ్యారు. అదేవిధంగా తనకు డేట్స్ ఏ మాత్రం ఖాళీగా లేకపోవడంతోనే ఈ సినిమా కథ వినకుండానే ఈమె రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో నయనతార స్థానంలోకి శృతిహాసన్ వచ్చారు.ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో వేచి చూడాలి.