ఎన్టీఆర్ తో చచ్చినా ఆ సీన్ చేయనని తెగేసి చెప్పిన నటి.. ఎవరంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రల్లోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి నటించే ఎన్టీఆర్ పక్కన అవకాశం వస్తే చాలు అని ఆశపడేవారు ఎందరో ఉంటారు.ఇలా ఎన్టీఆర్ సినిమాలో చిన్న పాత్రలో అవకాశం వచ్చిన అదృష్టంగా భావించేవారు కొందరు ఉండగా ఆయన పక్కన నటించే అవకాశం వచ్చిన ఒక సీన్ లో ఎన్టీఆర్ పక్కన నటించననీ ఒక హీరోయిన్ కరాకండిగా చెప్పేశారు.

ఈ విధంగా ఎన్టీఆర్ తో నటించినని ఆ నటి చెప్పడంతో ఆమె మాటలకు ఎన్టీఆర్ కాస్త బాధపడ్డారట ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. అప్పట్లో హీరో హీరోయిన్లు పెద్దగా రొమాంటిక్ సన్నివేశాలలో నటించేవారు కాదు. ఇక ఈ విషయంలో భానుమతి మరింత కచ్చితత్వంగా ఉండేది. ఆమెను కనీసం ఏ హీరో తాకను కూడా తాకకూడదనే కండిషన్లు పెట్టేది.ఈ క్రమంలోనే మల్లీశ్వరి సినిమాలో ఎన్టీఆర్ భానుమతి జంటగా నటించారు ఒక పాటలో భాగంగా ఎన్టీఆర్ తనని కౌగిలించుకోవాలి. అయితే ఈ సీన్ విన్న తర్వాత భానుమతి తాను చచ్చిన ఆ సీన్ లో నటించననీ చెప్పారట.

ఇక ఈ విషయంలో భానుమతి కచ్చితంగా ఉండడంతో చేసేదేమీ లేక దర్శక నిర్మాతలు ఆ సన్నివేశం లేకుండానే సినిమా కంటిన్యూ చేశారు. ఇకపోతే ఈ సినిమా కోసం భానుమతి 20 వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోగా ఎన్టీఆర్ మాత్రం 12000 రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు. అప్పట్లో సెలబ్రిటీలకు నెలవారి జీతాలుగా పారితోషికం చెల్లించేవారు కానీ భానుమతి మాత్రం రెమ్యూనరేషన్ మాదిరిగా సినిమాకు ఇంతనే డిమాండ్ చేసి తీసుకునేవారు. ఈ క్రమంలోనే ఈమెకు రెమ్యూనరేషన్ ఇవ్వడంతో ఎన్టీఆర్ కి కూడా రెమ్యూనరేషన్ ఇచ్చారు.ఇలా భానుమతికి 8,000 రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉండడంతో ఎన్టీఆర్ తనకన్నా నేనేం తక్కువ అంటూ అప్పట్లో విషయంలో చాలా బాధపడినట్లు తెలుస్తోంది.