వైరల్ : గ్యాప్ ని ఇలా ఫుల్ ఫిల్ చేసుకున్న జక్కన్న.!

ss-rajamouli (3)

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర వన్ అండ్ ఓన్లీ టాప్ దర్శకుడు అలాగే నెంబర్ 1 దర్శకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా దర్శక దిగ్గజం జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి అని మాత్రమే అని చెప్పాలి. కాగా ఎస్ ఎస్ రాజమౌళి సినిమా కోసం ప్రపంచ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా..

ఇక నెక్స్ట్ అయితే జక్కన్న భారీ లెవెల్లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సెన్సేషనల్ సినిమా నెక్స్ట్ చేయనున్నారు. ఇక జక్కన్న అయితే దీనికి ముందు చేసిన గ్లోబల్ హిట్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) తర్వాత ఇప్పుడు గ్యాప్ లో ఉన్న రాజమౌళి మహేష్ సినిమా పనుల్లో బిజీగా ఉండడమే కాకుండా దాని నుంచి కూడా ఉన్న గ్యాప్ లో అయితే ఫ్యామిలీతో అలా ట్రిప్ వేసేసారు.

లేటెస్ట్ గా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రస్తుతం తమిళ నాడులో ఉన్న అన్ని ముఖ్య పుణ్య క్షేత్రాలను కుటుంబ సమేతంగా అయితే రాజమౌళి సందర్శితున్నాడు. దీనితో బృహదీశ్వర, రామేశ్వరం, తూత్తుకుడి, మహాబలఃశ్వర్ సహా తమిళనాడులో ఉన్న ఎన్నో పురాతన దేవాలయాలను సందర్శించిన తాను తన స్పందనను తెలియజేసారు.

తన కూతురు ఐడియాతోనే తాము రోడ్ ట్రిప్ కి వెళ్లామని అయితే ఈ ట్రిప్ లో మన దేవరాలయాల ఆర్కిటెక్చర్, అలనాటి రాజులు చోళులు, పాండ్యుల ఇంజినీరింగ్ నైపుణ్యతలు అద్భుతం అని కొనియాడారు. దీనితో జక్కన్న స్పెషల్ ట్రిప్ ఇప్పుడు వైరల్ గా మారింది.